W.G: భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భక్తులు బంగారు విరాళాలు అందజేశారు. వడ్డీ దివ్య, వీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాములు, మోటూరుకు చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సిబ్బంది పాల్గొని దాతలను అభినందించారు.