E.G: ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఎర్నగూడెం గ్రామానికి చెందిన పాలూరి వెంకట చరిత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, సొసైటీ ఛైర్మన్ పెన్మత్స సుబ్బరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.