ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ‘ఫిల్మ్ సిటీ’కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దాదాపు 500 ఎకరాల్లో హాలీవుడ్ హంగులతో దీని నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వస్తే పర్యాటకం, ఉపాధి పెరగడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ సినిమా షూటింగ్లకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.