తమిళ హీరో సూర్య, వెంకీ అట్లూరి క్రేజీ కాంబోలో రాబోతున్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ మూవీ ‘కంగారూ’కి రీమేక్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2007లో విడుదలై భారీ విజయం అందుకున్న ‘కంగారూ’ కథను తెలుగు, తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.