AP: వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి, వైకుంఠ ఏకాదశి తరహా నమూనాను అమలు చేయాలని భావిస్తోంది. దీంతో వెయిటింగ్ టైం 23 గంటల నుంచి 12 గంటలకు తగ్గుతుందని అధికారుల అంచనా. తద్వారా రోజుకు 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు.