• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డ్రగ్స్ వాడకంతో కుటుంబాలు చిన్నాభిన్నం

BDK: చండ్రుగొండ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విశేష కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ వాడటం వల్ల అనారోగ్యంతో పాటు కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయన్నారు.

March 12, 2026 / 03:23 PM IST

వార్డులో ముమ్మరంగా పారిశుధ్య పనులు

MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కూతురు ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు డ్రైనేజీలు, పబ్లిక్ శౌచాలయాలను శుభ్రం చేశారు.

March 12, 2026 / 03:23 PM IST

‘రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందించాలి’

SRCL: అంగన్వాడి టీచర్లు, ఆయాలు రిటైర్ అయి రెండు సంవత్సరాలు గడిచిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందించకుండా కాలయాపన చేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

March 12, 2026 / 03:22 PM IST

38.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదు

ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. గురువారం కాగజ్ నగర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ 37 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

March 12, 2026 / 03:21 PM IST

99 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

WNP: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌గా 5 దశల్లో 5 ప్రత్యేక కార్యక్రమాలు 99 రోజులు జరుగుతాయని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అందరం అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు.

March 12, 2026 / 03:20 PM IST

శిక్షణ తరగతులు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు మంచి అవకాశం అని కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన శిక్షణ తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలకం అనే భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అన్నారు.

March 12, 2026 / 03:20 PM IST

ఆరోగ్య సేవలను పరిశీలించిన ఎమ్మెల్యే

NGKL: జిల్లాలో 18వ వార్డు బస్తీ దవాఖానలో గురువారం ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణీలు, స్థానిక ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.

March 12, 2026 / 03:16 PM IST

గద్వాలలో ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన

GDWL: పట్టణాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తోందని నోడల్ అధికారి నారాయణరావు తెలిపారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

March 12, 2026 / 03:15 PM IST

పాఠశాలలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే అసహనం

SDPT: దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అల్వాల ఎక్స్ రోడ్ చెప్యాల వద్ద ఉన్న పీఎంశ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనులను MLA కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాఠశాలలోని డార్మెటరీలు, శౌచాలయాలను పరిశీలించారు. దీంతో అక్కడి అపరిశుభ్రత గురించి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 12, 2026 / 03:14 PM IST

డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు

NZB: జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదని కలెక్టర్ తెలిపారు.

March 12, 2026 / 03:14 PM IST

నల్గొండ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం

NLG: నల్గొండ టౌన్ బస్టాండ్ సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆక్సిజన్ అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 03:12 PM IST

నల్గొండ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం

NLG: నల్గొండ టౌన్ బస్టాండ్ సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆక్సిజన్ అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 03:12 PM IST

ఒంటిపూట కూడా మిడ్ డే మీల్స్

NLG: ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సగం రోజు మాత్రమే పని చేస్తాయి. ఉ. 8:00 నుంచి మ.12:30ల వరకు తరగతులు నిర్వహించి, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు. టెన్త్ పరీక్ష జరిగే రోజు మాత్రమే మ. 1.00 నుంచి సా. 5.00 వరకు తరగతులు నడుస్తాయని డీఈవో బిక్షపతి గురువారం తెలిపారు.

March 12, 2026 / 03:12 PM IST

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు

MNCL: ఎండల తీవ్రత పెరగడంతో జన్నారం మండలం నిప్పుల కొలిమిలా మారింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మండలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అయితే తీవ్రత మాత్రం 42 డిగ్రీలుగా ఉండడంతో ప్రజలు ఒక్కరి బిక్కిరి అయ్యారు. ఉదయం నుంచి మండలంలోని పలు గ్రామాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు నిర్మాణస్యంగా మారాయి.

March 12, 2026 / 03:10 PM IST

ఇంటర్ పరీక్షలకు 98.25% విద్యార్థులు హాజరు

KMR: బిచ్కుంద మండలంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. నేడు జరిగిన కెమిస్ట్రీ, కామర్స్ తదితర పరీక్షలకు 286 మంది విద్యార్థులకు గాను 281 మంది విద్యార్థులు హాజరు కాగా, అయిదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 98.25% విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

March 12, 2026 / 03:09 PM IST