NLG: ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సగం రోజు మాత్రమే పని చేస్తాయి. ఉ. 8:00 నుంచి మ.12:30ల వరకు తరగతులు నిర్వహించి, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు. టెన్త్ పరీక్ష జరిగే రోజు మాత్రమే మ. 1.00 నుంచి సా. 5.00 వరకు తరగతులు నడుస్తాయని డీఈవో బిక్షపతి గురువారం తెలిపారు.