MNCL: ఎండల తీవ్రత పెరగడంతో జన్నారం మండలం నిప్పుల కొలిమిలా మారింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మండలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అయితే తీవ్రత మాత్రం 42 డిగ్రీలుగా ఉండడంతో ప్రజలు ఒక్కరి బిక్కిరి అయ్యారు. ఉదయం నుంచి మండలంలోని పలు గ్రామాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు నిర్మాణస్యంగా మారాయి.