NLR: కందుకూరులోని కోటారెడ్డి నర్సింగ్ హోమ్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు NTR వైద్య సేవలను ప్రారంభించారు. మూడు తరాలుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న కోటారెడ్డి కుటుంబాన్ని ఆయన అభినందించారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటికే 1200 మందికి రూ. 10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.