RR: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామ పరిధిలో గల మోల్లోన్ గడ్డ తండాలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శీను నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.
KMM: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
MHBD: తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ఛైర్మన్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.
KMM: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా నేత భూక్యా వీరభద్రం బుధవారం డిమాండ్ చేశారు. నేడు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.
BHPL: జిల్లా నాచారం గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై, మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగకరమని, యువతలో క్రమశిక్షణ, స్నేహభావం, జట్టు భావన పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో TRP నేతలు, క్రీడాకారులు ఉన్నారు.
BHPL: తాడిచెర్ల ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ లో తాడిచెర్ల ఉన్నత పాఠశాలకు చెందిన బి. సిరిచందన, శైలాని, పి. వర్దిని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.