RR: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామ పరిధిలో గల మోల్లోన్ గడ్డ తండాలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శీను నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.