ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. గురువారం కాగజ్ నగర్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ 37 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.