GDWL: పట్టణాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తోందని నోడల్ అధికారి నారాయణరావు తెలిపారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్తో కలిసి ఆయన పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.