KMR: బిచ్కుంద మండలంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. నేడు జరిగిన కెమిస్ట్రీ, కామర్స్ తదితర పరీక్షలకు 286 మంది విద్యార్థులకు గాను 281 మంది విద్యార్థులు హాజరు కాగా, అయిదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 98.25% విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.