HYD: జీవో నం. 15 ప్రకారం మాల్స్ లేదా మల్టీప్లెక్స్లో మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితం. ఒకవేళ అక్కడ షాపింగ్ చేస్తే గంట వరకు ఉచితంగా ఉండాలి. కానీ, మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని కొన్ని ప్రధాన మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తున్నాయి. లోపల సమయం వృథా అయ్యేలా చేసి రూ. 50 నుంచి రూ. 100 వసూలు చేయడం గమనార్హం.
GDWL: నడిగడ్డ భక్తుల ఆరాధ్యదైవం, జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని గద్వాల నూతన మున్సిపల్ ఛైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు శుక్రవారం సందర్శించారు. ఆలయ ఈవో పురందర కుమార్, అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వారికి శ్వేత వస్త్రాలు సమర్పించారు.
HYD: నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని హైదరాబాద్-2 డిపో నుంచి రాకపోకలు సాగించే బస్సులకు సంబంధించి ప్రయాణికుల నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు నేడు సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు 9959226249 నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం కాసేపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో ఛైర్మన్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
BDK: జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పశు వైద్యశాల శిథిలావస్థకు చేరింది. దీంతో పశు వైద్య సిబ్బంది పశువులను తీసుకొచ్చిన రైతులు లోపలికి వెళ్లాలంటే భయపడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పశు వైద్యశాలను తొలగించి నూతన పశువైద్యశాలను నిర్మించాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు.
MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని జన్నారం మండలం ఎంపీవో జలంధర్ సూచించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది. పలు విషయాలను వార్డు సభ్యులకు ఎంపీవో వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
SDPT: జిల్లా రాయపోల్ మండలం మంతూర్–అనాజీపూర్ శివారులో 13డి కాలువలో గోదావరి జలాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్యతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం నీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా చూసుకోలేకపోతుందన్నారు.
BHPL: భూతగాడ నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో గొర్లవీడు గ్రామానికి చెందిన మామిడి రాజకుమార్, అతని భార్య రమను దోషులుగా నిర్ధారించిన జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులిద్దరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ఇద్దరికీ చెరో రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 10 వేల జరిమానా విధించినట్లు ఇవాళ SP సంకీర్త్ తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను MLA పాయల్ శంకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో స్రవంతితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రనమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
NLG: దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే రూ.8500 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KMR: రామారెడ్డి PHC నీ ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన వెంట DMHO డా.విద్య ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల, బాలింతల పట్ల తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్య శాఖ సమన్వయంతో అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీషన్ ఫుడ్ అందిస్తున్న సేవల వివరాలపై ఆరా తీశారు.
పెద్దపల్లికి చెందిన ఓ మహిళ (33)కు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అండాశయం ఎడమవైపు భాగంలోని డెర్మాయుడు సిస్ట్ తొలగించినట్లు సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. సర్జరీలో పాల్గొన్న వైద్య బృందం డాక్టర్లను ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను పేద ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
MDK: శివంపేట మండలంలోని కొత్తపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
BDK: ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమంలో కుటుంబ సమేతంగా శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. స్వామివారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రామయ్య ఆశీస్సులు అందరిపై ఉండే సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
GDWL: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా.ఆంజనేయ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదని ఆయన తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో అనవసర వాదోపవాదాలు సరికాదని హితవు పలికారు.