ADB: భోరాజ్ మండలం బాలాపూర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అచ్యుత్ కార్మికులను శాలువాలతో సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు (MPW) కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు.