RR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేవెళ్ల మున్సిపాలిటీ 13వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని రోడ్లను శుభ్రం చేస్తూ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేశారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.