W.G: ఈ నెల 5వ తేదీన చేపట్టనున్న ‘చలో ఆకివీడు’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని ఎస్సై హనుమంతు నాగరాజు స్పష్టం చేశారు. దత్త గుడి నుంచి రామాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మండలంలో ప్రస్తుతం 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.