NDL: ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లిలో అర్ధరాత్రి ధాన్యం దొంగతనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్లాట్ల వద్ద ఆరబోసిన పొద్దుతిరుగుడు విత్తనాలను సంచులలో నింపుకొని పారిపోతున్న వ్యక్తులను పట్టుకున్నారు. గత వారం రోజులుగా మినుము బస్తాలు మాయమవుతుండటంతో రైతులు అప్రమత్తమయ్యారు. పట్టుబడ్డ నిందితులపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.