JGL: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ శ్యామ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.