KMR: ఎల్లారెడ్డి 2వ వార్డు ప్రియా థియేటర్ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను విద్యుత్ సిబ్బంది తొలగించి, నూతన పోల్స్ ఏర్పాటు చేశారు. విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రమాదంగా మారడంతో స్థానికులు కౌన్సిలర్ మహేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె అధికారులతో మాట్లాడి కొత్త స్తంభాలు వేయించారు.