• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

BJLP సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం రోజున సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేఎల్‌పీ సమావేశంలో పాల్గొన్నారు. నేటి నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు.

March 16, 2026 / 06:02 AM IST

పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

WNP: పేకాట ఆడుతున్న 5 గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై రిషికేష్ తెలిపారు. వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన 5 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారంతో రైడ్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. పేకాట స్థవరంలో పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.14,520 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

March 16, 2026 / 06:01 AM IST

గ్రామపంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానం

NGKL: కోడేరు మండలం నాగులపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని సర్పంచ్ సరిత జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సాయిలీల, పాలకవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి హ్యాండ్ వాష్, సోపు ఆయిల్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. 99 రోజుల ప్రగతి ప్రణాళికల అభివృద్ధిలో జీపీ సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు.

March 16, 2026 / 05:59 AM IST

పిచ్చి మొక్కలు, కంపచెట్లు తొలగింపు

 GDWL: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అలంపూర్‌లోని ఐదో వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిసరాలలో మొలిచిన పిచ్చి మొక్కలను, కంప చెట్లను జేసీపీ సహాయంతో స్థానిక వార్డు కౌన్సిలర్ మల్లెపోగు జమ్మన్న తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పిచ్చి మొక్కలను, కంపచెట్లను తొలగించామని పేర్కొన్నారు.

March 16, 2026 / 05:56 AM IST

బావోజి జాతర గోడ పత్రిక ఆవిష్కరణ

NRPT: కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఏప్రిల్ 1 నుంచి బావోజీ జాతర ఉత్సావాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు.  2వ తేదీన రథోత్సవం, 3న స్వామివారి పల్లకి సేవ, మహోహోమం, 4న అమ్మవారి పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

March 16, 2026 / 05:55 AM IST

ప్రజా పాలనలో ‘హ్యాపీ సండే’ సందడి

KMM: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో నిన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద ‘హ్యాపీ సండే’ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు. ఆటపాటలు, వివిధ పోటీలతో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా గడిపినట్లు నిర్వాహకులు తెలిపారు.

March 16, 2026 / 05:52 AM IST

శంకర్‌పల్లి సీఐకి MRPS మండల అధ్యక్షుడి సన్మానం

RR: శంకర్‌పల్లి SHO మీర్ ముదస్సర్ అలీ నూతనంగా పోస్టింగ్ తీసుకున్న సందర్భంగా పట్టణ MRPS అధ్యక్షుడు బండ్లగూడెం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, MRPS నాయకులు పాల్గొన్నారు. అనంతరం ముదస్సర్ అలీనీ పూలమాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.

March 16, 2026 / 05:43 AM IST

వృద్ధుడిపై దాడి ఘటనపై కేసు నమోదు

మహబూబ్‌నగర్ పట్టణంలోని హబీబ్‌నగర్ ప్రాంతంలో వృద్ధుడిపై జరిగిన దాడి ఘటనపై వన్‌డేడ్ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వన్ టౌన్ ఎస్సై అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హబీబ్‌నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్ వహీద్ (72), రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి దాడి చేసినట్లు పేర్కొన్నారు.

March 16, 2026 / 05:42 AM IST

మియాపూర్ మజీద్-ఏ-బిలాల్‌లో ఇఫ్తార్ విందు

RR: మియాపూర్‌లోని స్టాలిన్‌నగర్ కాలనీలోని మజీద్-ఏ-బిలాల్‌లో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ హాజరయ్యారు. రంజాన్ పండుగ సోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండారు మోహన్ ముదిరాజ్, మర్రపు గంగాధర్ రావు, బండారు వినయ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

March 16, 2026 / 05:41 AM IST

నేటి ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన -2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్య క్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

March 16, 2026 / 05:40 AM IST

ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: మంత్రి

MBNR: జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

March 16, 2026 / 05:21 AM IST

సైబర్ ముఠా గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్

KNR: ”ఆపరేషన్ క్రాక్డౌన్”లో భాగంగా కరీంనగర్ పోలీసులు భారీ సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్నారు. అమాయకుల పేరుతో ‘మ్యూల్ ఖాతాలు’ సృష్టించి నేరగాళ్లకు విక్రయిస్తున్న ప్రధాన సూత్రధారి రాజేశ్వర్ రెడ్డితో సహా 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై పట్టణంలోని వన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ ముఠాను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు.

March 16, 2026 / 05:14 AM IST

‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

ADB: మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 102 అంబులెన్స్ జిల్లా మేనేజర్ మనోహర్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని 102 అంబులెన్స్‌ను పర్యవేక్షించి రికార్డులు, పరికరాలను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. గర్భిణీ మహిళలను సమయసారిని ప్రకారం ఆసుపత్రికి తీసుకెళ్లి సురక్షితంగా ఇంటికి చేర్చాలని సిబ్బందికి సూచించారు.

March 16, 2026 / 05:09 AM IST

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి: IFTU

ASF: కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని IFTU నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 16న కలెక్టరేట్, 23న హైదరాబాద్ లేబర్ కమిషనరేట్ ఎదుట నిర్వహించే ధర్నాల పోస్టర్లను ఆదివారం ఆసిఫాబాద్‌లో IFTU నాయకులు ఆవిష్కరించారు. ఏప్రిల్ ఒకటి నుంచి కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.

March 16, 2026 / 05:08 AM IST

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం

JGL: మల్యాల(M)లో ఓ ఇంటితో పాటు దుకాణంలో దొంగతనం జరిగినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఎక్స్ రోడ్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి సుమారు రూ. 30,500 విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు, నగదును ఎత్తుకెళ్లారు. అలాగే ఓ టీషాప్ కిటికీనీ పగలగొట్టి రూ.7500 విలువ చేసే సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు అరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 16, 2026 / 05:06 AM IST