KNR: అత్యుత్తమ విద్యా బోధనకు కేరాఫ్ అడ్రస్గా మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాన్ని తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు సూచించారు. అత్యుత్తమ విద్యను బోధించాలని మంచి ఫలితాలు సాధించి గురుకులాన్ని టాప్లో నిలబెట్టాలని పేర్కొన్నారు. తిమ్మాపూర్లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
MNCL: అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. వేసవి నేపథ్యంలో జన్నారంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు, వాటి నివారణపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలలో చెత్తాచెదారం, గడ్డివాములు ఉంటే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.
MNCL: అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. వేసవి నేపథ్యంలో జన్నారంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు, వాటి నివారణపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలలో చెత్తాచెదారం, గడ్డివాములు ఉంటే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.
NZB: మండల ప్రత్యేక అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వచ్చే రెండు మూడు వారాలు ఎంతో కీలకమైనవన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల పరిధిలోని గ్రామ సభలను సందర్శించన్నారు.
GDWL: డిజిటల్ క్రాఫ్ట్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ పక్కాగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని గోనుపాడు శివారులో పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంటల దిగుబడి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మరో నెల రోజుల్లో అన్ని పంటలు చేతికి వస్తాయని రైతులు తెలిపారు.
GDWL: జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఎర్రవల్లి మండల అభివృద్ధికి సహకరించాలని ఎర్రవల్లి మాజీ సర్పంచ్ జోగుల రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవల్లి మండలంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేయాలని కోరారు.
SRPT: అంగన్వాడీల హక్కుల పోరాటాన్ని అణచివేయడం సరికాదని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంపటి గురూజీ అన్నారు. సోమవారం సూర్యాపేటలో అరెస్టయిన టీచర్లను పరామర్శించిన ఆయన.. ప్రభుత్వం నిర్బంధ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సర్పంచ్ల పెత్తనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
KMM: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను సోమవారం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో జరిపారు. ఆర్యవైశ్య సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు. గ్రామ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, కృష్ణారావు, మంగయ్య, లింగయ్య, నరేష్ పాల్గొన్నారు.
SRD: పటాన్ చెరువులో రైల్వే స్టేషన్ ఏర్పాటు, పలు అభివృద్ధి అంశాలపై దక్షిణ మధ్య రైల్వే డీజీఎంతో ఎంపీ రఘునందన్ రావు చర్చలు జరుపుతున్నారని పటాన్ చెరువు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. ఇవాళ HITTV ప్రతినిధితో మాట్లాడుతూ.. రైల్వే లైన్ కారణంగా ఇళ్లు కోల్పోతున్న బాధితుల పక్షాన నిలుస్తామని, వారికి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ పరికరాలను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి మానసిక వికాసానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
VKB: విద్యా కమిషన్ రిపోర్ట్ పూర్తిగా నిరుద్యోగులను టీచర్లను అవమానించేలా ఉందని గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్పై, ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన రిపోర్ట్పై మీడియా సమావేశం నిర్వహించారు. తక్షణమే ఆయన రిపోర్టును ఎలాంటి పరిగణలోకి తీసుకోవడంలేదని ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం చెప్పాలని కోరారు.
BHNG: వాసవి క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సభ్యులు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు.
MLG: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ములుగు కలెక్టరేట్లో జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎం.సంపత్ రావు మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని తెలిపారు. జిల్లాలో బాలల సమస్యల పరిష్కారం, బాల్యవివాహాల నివారణ, బడి మానిన పిల్లలను తిరిగి చదువులో చేర్చే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
PDPL: రామగుండం ఏరియా AITUCలో కీలక బాధ్యతలు పోషించిన నాయకులు ఆరెల్లి పోశం HMSలో చేరారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, HMS రాష్ట్ర నాయకులు రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో HMS కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు యూనియన్లోకి సాధారణంగా ఆహ్వానించారు.
BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, అన్ని శాఖ అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 52 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. దరఖాస్తులు జాప్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు.