• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసి మృతి

BDK: సారపాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగ వెంకట్రెడ్డి(20) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరు జాతీయ రహదారిపై బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ముందు నిలిచిన వాహనాన్ని ఢీకొని పడిపోగా, వెంటనే వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపై దూసుకెళ్లినట్లు సమాచారం. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఈ యువకుడి అకాల మరణంతో కుటుంబసభ్యులు, దిగ్భ్రాంతికి గురయ్యారు.

February 20, 2026 / 08:36 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే

NGKL: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండిలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 20, 2026 / 08:34 PM IST

రాయితీ బియ్యం స్వాధీనం: CI

ADB: ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొలిపుర ప్రాంతంలో 7.5 క్వింటల్లా రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు CI సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. చిలుకూరి లక్ష్మీ నగర్‌కు చెందిన నిందితుడు షేక్ ఇమ్రాన్ అహ్మద్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

February 20, 2026 / 08:34 PM IST

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు: కలెక్టర్

NZB: నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని ప్రమాణాలు పాటిస్తూ స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.

February 20, 2026 / 08:33 PM IST

భక్తితో మానసిక ప్రశాంతత: నీలం మధు

SRD: భక్తి మార్గం ద్వారానే సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని నీలం మధు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరులో నూతన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఆధ్యాత్మికత పెరిగితే సోదరభావం వృద్ధి చెందుతుందని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:33 PM IST

అక్రమ మద్యంపై ఎక్సైజ్ దాడులు

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై శరత్ నేతృత్వంలో శుక్రవారం కన్నారెడ్డి, జప్తి జానకంపల్లి తండాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 6 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

February 20, 2026 / 08:32 PM IST

విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ

MDK: తూప్రాన్ పట్టణ బాలుర, బాలికల పాఠశాలలో చదువుతున్న 31 మంది అనాధ, సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు పరీక్ష కిట్స్ అందజేశారు. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రవి నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ ఏఈ స్వప్న సహకారంతో విద్యార్థులను గుర్తించి కిట్స్ అందజేసినట్లు వివరించారు.

February 20, 2026 / 08:31 PM IST

నూతన పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ భవనంతో గ్రామ సభలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభంగా, పారదర్శకంగా జరుగుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:31 PM IST

‘నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి’

ADB: ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న గురుకుల పాఠశాల అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కో-ఆర్డినేటర్ లలిత కుమారి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు.

February 20, 2026 / 08:31 PM IST

సీఎంఆర్ఎఫ్ మంజూరు పత్రం అందజేసిన తలసాని

HYD: అనారోగ్యానికి గురైన మహిళకు CMRF మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. సనత్‌నగర్‌లోని బీకేగూడకు చెందిన బొడ్డు స్వప్న అనారోగ్యంతో బాధపడుతోంది. CMRF దరఖాస్తు చేయగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంజూరు పత్రాన్ని అందజేశారు.

February 20, 2026 / 08:26 PM IST

మంత్రి తుమ్మలతో షబ్బీర్ అలీ కీలక భేటీ

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చురుకైన అడుగులు వేస్తున్నారు. శుక్రవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యవసాయ, సాగునీటి రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

February 20, 2026 / 08:24 PM IST

జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: DIEO

ASF: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు DIEO రాందాస్ శుక్రవారం తెలిపారు. 5,025 మంది మొదటి సంవత్సరంలో, 4,691 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

February 20, 2026 / 08:23 PM IST

ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏసీ బస్సుల్లో డిస్కౌంట్

HYD: ఎండాకాలం వచ్చేస్తోంది.. మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. దీంతో సిటీలో బయటకు వెళ్లాలంటే భయమేసే పరిస్థితులు నెలకొంటాయి. అందుకే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలో దాదాపు 90 ఏసీ బస్సులు సిటీలో తిరుగుతున్నాయి.

February 20, 2026 / 08:19 PM IST

వాటర్ ప్లాంట్, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: చెన్నారావుపేట మండలంలోని అక్కల్ చేడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, వాటర్ ప్లాంట్‌ను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు.

February 20, 2026 / 08:18 PM IST

కల్తీ యూరియా కలకలం.. రైతులఆందోళన

రామన్నపేట మండలంలో డీలర్ల వద్ద కొన్న యూరియా నకిలీదంటూ కొమ్మాయిగూడెం రైతులు ఆరోపించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 6 బస్తాలలో 3 తెరిచి చూడగా నల్లటి మట్టి పెళ్లల వంటివి కనిపించాయని, బరువు కూడా తక్కువగా ఉందని నరసింహ, గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే, కల్తీ యూరియాతో మోసం చేస్తున్నారని వాపోయారు.

February 20, 2026 / 08:16 PM IST