KMR: మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున్ ఇద్దరు కొడుకులు, కోడలు చార్టెడ్ అకౌంటెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఆదివారం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పెద్ద కుమారుడు రమేష్ భార్య ప్రియా కూడా చార్టెడ్ అకౌంటెంట్ పనిచేస్తున్నారు. దీంతో ఆ గ్రామస్థులు కూడా వారిని అభినందిస్తున్నారు.