NLG: మల్లేపల్లి-చింతపల్లి మార్గంలో ఆటో-లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందడం బాధాకరం. దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5 మంది క్షతగాత్రులను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.