GNTR: తెనాలి నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు CMRF చెక్కులను శనివారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు వీటిని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనను కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు.