కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామం ప్రత్యేక పరిపాలన అధికారిగా ఎంపీడీవో పద్మజ్యోతి బాధ్యతలు స్వీకరించారు. ఆమె ద్రాక్షారామంతో పాటు రామచంద్రపురం మండల పరిధిలోని వెల్ల, వెంకటాయపాలెం, వెలంపాలెం గ్రామాలకు కూడా ఆమె ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆమెను సచివాలయ ఉద్యోగులు, గ్రామ పెద్దలు ఆమెను కలిసి స్వాగతం పలికారు.