అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని నరసరంపేట సమీపంలోని గుంజనేరులో శనివారం అరుదైన కింగ్ ఫిషర్ (లకుముకి పిట్ట) దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయం తెలిసిన స్థానిక యువకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పక్షిని వీక్షించారు. తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కలయికతో అందంగా కనిపించే ఈ పక్షి నీటి దగ్గర ఉండి చేపలను ఆహారంగా తీసుకుంటుంది.