VZM: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను 25 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలన్నారు.