BPT: అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్లో పాలిసెట్ పరీక్షకు ఈనెల 6 నుంచి 23 వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ షేక్ సాహిల్ బాబు తెలిపారు. పరీక్ష ఈనెల 25న జరగనుంది. విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కూడా అందించబడుతుంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.