విమాన ప్రయాణికులపై గురువారం నుంచి ఇండిగో సంస్థ ఇంధన ఛార్జీలు వడ్డించనుంది. దేశీయ సర్వీసులపై రూ.275 నుంచి రూ.950 వరకు ఇంధన ఛార్జీలు ఉండనున్నాయి. అంతర్జాతీయ సర్వీసులపై రూ.900 నుంచి రూ.10 వేల వరకు ఉండనున్నాయి. ఇటీవల విమాన ఇంధనం ధరలు రెట్టింపు కావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.