AP: డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ‘వజ్ర ప్రహార్’ పేరిట ఈ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడలో అధికారులపై కొందరు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.