KRNL: నందవరం మం. మాచాపురం గ్రామంలో నెలకొన్న తాగునీటి కొరతపై స్పందించిన వైసీపీ పార్టీ నాయకులు తక్షణ చర్యలు చేపట్టారు. సమస్యను మాజీ MP బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే స్పందించిన ఆమె ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ గ్రామంలో బోర్ వేయించి నీటి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
NTR: కంచికచర్ల మండలం మోగులూరులో ప్రజాదర్బార్ కార్యక్రమం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎండాకాలంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
NDL: బేతంచర్ల మండల అధ్యక్షుడు ఎల్ల నాగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఎంబాయి గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ముగ్ధులై వారు పార్టీలో చేరారన్నారు.
E.G: కొవ్వూరు మండలంలోని మద్దూరు, మద్దూరులంక, వాడపల్లి, కుమారదేవం, పెనకనమెట్ట, చీడిపి, వేములురు గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. మొత్తం రూ.5,53,383 విలువైన చెక్కులను పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KKD: పిఠాపురం మండలంలో మే ఒకటో తేదీ నుంచి జనగణన ప్రారంభం కానుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందికి మూడు బ్యాచ్లుగా శిక్షణ ఇచ్చారు. ఈసారి ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు సేకరించాలని, ఎన్యుమరేటర్లు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది సందేహాలను నివృత్తి చేయాలన్నారు.
గుంటూరు నగరంలోని మోతీలాల్ నగర్ జీరో లైన్లో ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే 60 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లు కూల్చొద్దని సీపీఐ నాయకులు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందించారు. జంగాల అజయ్, కోటా మాలాద్రి తదితరులు పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
ELR: పోలవరం మండలం బోడిగూడెంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను MPDO శ్రీనివాస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న భోజన నాణ్యత, తాగునీటి వసతి, వసతి గృహ సౌకర్యాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు.
ELR: జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం పాఠశాలలో హోమియోపతి వైద్యుడు డాక్టర్ శ్యామ్ విద్యార్థులకు సన్ స్ట్రోక్ పై అవగాహన కల్పించారు. వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువగా నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని సూచించారు. తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.
VSP: మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం కుంకుమార్చన, పుష్పార్చన, అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దాతల సహకారంతో సుమారు 350 మంది భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ATP: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి అర్జీపై తక్షణమే స్పందించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
NDL: ABN, ఆంధ్రజ్యోతి సంస్థల MD రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ తన మీడియాలో చేసిన వ్యాఖ్యలు అత్యంత అవహేళనకరంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రాధాకృష్ణపై శుక్రవారం ఆత్మకూరు PSలో వైసీపీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలను, కార్యకర్తలను వెన్నుముక్క లేనివారిగా అభివర్ణించడం మీడియా స్థాయిలో ఉన్న వ్యక్తులకు తగదన్నారు.
ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణను ప్రభుత్వం శుక్రవారం నియమించింది. ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీల బదిలీలలో భాగంగా ఈ నియామకం చేపట్టారు. ప్రస్తుతం వైజాగ్ క్రైమ్ బ్రాంచ్లో విధులు నిర్వర్తిస్తున్న బాలమురళీకృష్ణకు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది.
అన్నమయ్య: మదనపల్లి తాలూకాలో సీఐ కళా వెంకటరావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. భూవివాదం నేపథ్యంలో గాంధీపురానికి చెందిన దళితుడు రామయ్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి, లాఠీలతో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. అడ్డుకున్న దళిత మహిళలతో కూడా సీఐ అనుచితంగా ప్రవర్తించి బయటకు తోసేశారని బాధితులు పేర్కొన్నారు. గాయపడిన వారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
GNTR: జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 600కు పైగా ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. 326 వాహనాలకు రూ.4 లక్షల ఛలానాలు విధించి, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై 206 వాహనాలు సీజ్ చేశారు. పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులకు రోడ్డు భద్రతా నియమాలపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అవగాహన కల్పించారు.
PLD: పెదకూరపాడు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది. సుమారు 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయింది. గురువారం సాయంకాలం వర్షం, శుక్రవారం మధ్యాహ్నం మండుటెండలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యామన్నారు. రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. జన నివాసాల నుంచి ప్రజలు ఎవరు బయటకు వచ్చేందుకు సుముఖత చూపటం లేదు.