NDL: సంజామల మండలం ముదిగేడు గ్రామ సచివాలయంలో అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకొని పంచాయితీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి సచివాలయ ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో SPSR సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. మహబూబ్ బేగ్, సురేంద్ర, ప్రేమ్ రాజ్, మస్తాన్, రామకృష్ణ, గౌసియా, రేష్మ పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలసలో వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన త్యాగాన్ని మన తెలుగుజాతి ఏనాటికీ మరచిపోదని అన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో మనరాష్ట్ర అభ్యున్నతి కోసం అందరం పాటుపడాలని కోరారు.
NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో రేపటి నుంచి శ్రీవారికి ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధానార్చకులు క్రీడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ .. ప్రతి ఏటా ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ గోదాదేవి ఆండాళ్కు నెలరోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
కోనసీమ: గుంటూరులో జరుగుతున్న మహసభకు ఆదివారం కాజులూరు మండలం నుంచి మాలమహానాడు నేతలు భారీగా తరలి వెళ్లారు. బస్సులతో పాటు పలు వాహనాల్లో గుంటూరు సభకు మాలలు బయలు దేరారు. ఈ సందర్భంగా జై మాల, జై జై మాల నినాదాలు మిన్నంటాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకుంటామంటూ వారు ప్రతిజ్ఞ చేశారు.
KKD: టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును అన్నవరం దేవస్థానం నూతన ఈవో సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం అన్నవరం దేవస్థానం నూతన కార్యనిర్వాహణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా యనమలను కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు.
W.G: తణుకు పట్టణంలో సూర్యాలయం వీధిలో కొలువైవున్న శ్రీ సూర్యభగవానుడికి స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం కావడంతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తణుకు, పైడిపర్రు, వేల్పూరు, చివటం, కొమరవరం, పాలంగి, తదితర గ్రామాల ప్రజలు స్వామి వారిని దర్శిచుకున్నారు. పూజలు అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
VZM: కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం జరిగిన రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో నిర్వహించిన జావెలిన్ త్రోలో ఎస్ కోట వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన 50 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు క్రీడాకారులను అభినందించారు.
VZM: గంట్యాడ మండల కేంద్రంలో గల శ్రీనివాస, కనకదుర్గ రైస్ మిల్లులను శనివారం జేసి సేతు మాధవన్ సందర్శించి తనిఖీలు చేపట్టారు. మిల్లులో రికార్డులను పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. మిల్లు యజమానులు ధాన్యం తూకం విషయంలో అక్రమాలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు మిల్లును తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.
SKLM: నరసన్నపేట మండలం ఉర్లాంలోని నివసిస్తున్న దొంపాక వరహాలమ్మ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం బారిన పడి ఆమె శనివారం మృతి చెందింది. వరహాలమ్మ తమ్ముడు కొన్నేళ్ల క్రితం మరణించారు. అయితే ఆమె మృతి విషయం తెలుసుకున్న వరహాలమ్మ తమ్ముడి భార్య లక్ష్మి అంత్య క్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
NLR: పొదిలి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎస్.ఎస్ఎన్ డిగ్రీ కళాశాల, సాయంత్రం సాయిబాబా గుడి ఆవరణలో ఉచితంగా ధ్యానంపై సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి.శైలజ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NDL: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో నేటి సాయంత్రం స్వామి అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని సాంప్రదాయపద్ధతిగా నిర్వహిస్తారు. సర్కారీ సేవ కింద దేవస్థానం ప్రతిరోజు వివిధ ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ధర్మపథంలో భాగంగా.. ఆలయ దక్షిణ మాడవీధుల్లోని నిత్య కళారాధన వేదిక వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
NDL: రుద్రవరం మండలం కోటకొండ చెరువులో ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి వేళ పెద్ద ఎత్తున భారీ వాహనాలతో ఎర్రమట్టిని తోడేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని వాపోయారు. ఎర్రమట్టి తవ్వకాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం పెద్దకురపల్లి పంచాయితీ మట్లవారిపల్లి జడ్పీ హైస్కూల్లో ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను హెచ్ఎం బాలసుబ్రమణ్యం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SKLM: జిల్లాలోని BRR వంశధార, నారాయణపురం ఆనకట్ట మైనర్ ఇరిగేషన్ కింద మొత్తం 2,628 నీటి సంఘాల ప్రాదేశిక స్థానాలకు శనివారం ఎన్నికలు జరగగా 2606 స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. పలు కారణాలతో ఇంకా 22 ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 344 నీటి సంఘాలకు గాను రెండు మినహా మిగతా అన్నిచోట్ల గెలుపొందిన వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
SKLM: టెక్కలి మండలం స్థానిక అంబేద్కర్ జంక్షన్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. భార్య భర్తల మనస్పర్థల కారణంగా మనస్తాపానికి చెందిన నాగులు కుమారి(20) ఆదివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకుంది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి చేరుకుంది. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.