W.G: పాలకొల్లులో ‘సేవ్ ద గర్ల్’ నినాదంతో 2కె రన్ కార్యక్రమాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 19వ శతాబ్దం తొలినాళ్లలో ఆడబిడ్డ పుడితే లక్ష్మీదేవి పుట్టిందనే ఒక ఆనందంతో ఉండేవారని, కానీ ప్రస్తుత రోజుల్లో ఆడపిల్ల పుడితే భారంగా చూస్తున్నారన్నారు. అడబిడ్డ విలువ తెలిసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
కాకినాడ: అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని కాకినాడలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CBM స్కూల్ రోడ్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని అన్నారు.
W.G: ఆచంట మండలంలోని వశిష్ట గోదావరి లంక గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పడవపై పర్యటించారు. ఈ సందర్భంగా 2027 గోదావరి మహా పుష్కరాల సందర్భంగా ఏర్పాట్ల సన్నద్దత కొరకు గోదావరి గట్టును ఇరిగేషన్ ఏస్ఈ శ్రీనివాస్, ఇరిగేషన్ ఏటిగట్టు అధికారులుతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని రాచర్ల మండలంలో బెల్టు షాపులపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. జేపీ చెరువు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 96 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలియజేశారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.
ప్రకాశం: గిద్దలూరు శ్రీనివాస్ విక్టరీ షోటోకన్ కరాటే ట్రైనింగ్లో శిక్షణ పొందిన విద్యార్థులు చెన్నై నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లో సత్తా చాటారు. ఐదు గోల్డ్ మెడల్స్, ఆరు సిల్వర్ మెడల్స్ సాధించారు. మెడల్స్ గెలుపొందిన విద్యార్థులను MLA అశోక్ రెడ్డి అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు రాణించి, పుట్టిన ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.
KRNL: కౌతాళం మండలంలోని మెళిగనూరు సమీపంలో తుంగభద్ర నదిలో మొసళ్లు హల్ చల్ చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామస్థులు నదిలోకి వెళ్లాలంటే భయపడి పోతున్నామన్నారు. నదిలో సంచరిస్తున్న మొసళ్లు అప్పుడప్పుడు నదిలో గట్ల పైకి వస్తున్నాయి. వీటిని గమనించిన గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
NLR: ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేయాలంటే చంద్రబాబుకే సాధ్యం అన్నారు. చెత్త నిర్ణయాల వల్ల వైసీపీ 151 నుంచి 11 కు పరిమితం అయ్యిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు.
KRNL: ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్లు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆశయాలను, సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
ఎన్టీఆర్: తిరువూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.8.87లక్షల చెక్కులను 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
CTR: శ్రీకాళహస్తి పట్టణంలో జైరాం వీధిలో రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుందని స్థానికులు అంటున్నారు. దీంతో అటుగా వెళ్లే వారికి దుర్వాసన అధికంగా వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. కాలువలు శుభ్రం చేయకపోవడంతో అవి నిండి, రోడ్డుపై ప్రవహిస్తుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
కోనసీమ: సఖినేటిపల్లి (M) అంతర్వేదిలో ఆదివారం రావి సత్య నారాయణ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పిల్లలు లేక అన్న కుమారుడు రాంబాబుని సత్యనారాయణ పెంచుకున్నారు. అతని పేరున ఉన్న 40 సెంట్ల భూమిని తన పేరున రాయాలని పెంచుకున్న కొడుకు కొద్ది రోజుల నుంచి వేధిస్తున్నాడు. అందుకు సత్యనారాయణ నిరాకరించడంతో స్టూల్తో కొట్టి చంపినట్లు తెలిపారు.
ATP: గుత్తి మండలంలోని వివిధ గ్రామాల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. గుత్తి మండలంలోని బాచుపల్లి, ఊటకల్లు, బేతపల్లి, యంగనపల్లి తదితర గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు పేరుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా పంచాయతీ అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రకాశం: గిద్దలూరులో ఆదివారం శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు కూడా అర్పించిన వ్యక్తి శ్రీరాములు అన్నారు. యవత శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలని బీజేపీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ తెలిపారు.
ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆదివారం కనిగిరి పట్టణంలోని బొడ్డు చావడి వద్ద ఉన్న రాములు విగ్రహానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధనకై అమర నిరాహార దీక్ష చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలేటి చిన్న, ఆర్యవైశ్య నాయకులు, పాల్గొన్నారు.
NLR: దర్శిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా దర్శి YCP కార్యాలయంలో నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి వారు మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు తలుచుకొని కొనియాడారు.