TPT: తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 23 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. అలాగే నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు నడిపిన 46 మందికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. మొత్తంగా 69 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.