ASR: అనంతగిరి మండలంలో సెల్ఫీల సరదా విషాదంగా మారింది. వాలసి పంచాయతీ మలుంగుమ్మి జలపాతంలో గురువారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువతులు మృతి చెందారు. బూర్జ పంచాయతీ జంబువలసకు చెందిన నలుగురు అమ్మాయిలు ఫొటోలు తీసుకునేందుకు జలపాతానికి వెళ్లారు. ముగ్గురు నీటిలోకి దిగగా, మరో యువతి సెల్ఫీ తీస్తుండగా జారి ప్రవాహంలో కొట్టుకుపోయారు.