కృష్ణా: గూడూరు మండలం చిట్టి గూడూరులో పేకాట స్థావరంపై ఎస్సై దివ్య ప్రకాశ్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.