PLD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పల్నాటి తిరుమలలో ‘నేతి వెంకన్న’ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారు పైకప్పు లేకుండా ప్రకృతి ఒడిలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలోని నాలుగు శనివారాలతో పాటు ఉగాది వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.