కృష్ణా: నాలుగేళ్ల క్రితం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో 559 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నివేశనా స్థలాలను కేటాయించింది. నాగాయలంక, భావదేవరపల్లి గ్రామాలకు చెందిన వారికి సెంటున్నర భూమి ఇచ్చి రాళ్లు వేశారు. ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తే ఒక ఊరుగా మారుతుందని ప్రజలు ఆశించారు. కానీ నేటికీ నిర్మాణాలు జరగకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి.