NLR: యుద్ధ ప్రభావం సామాన్య కుటుంబాలపై చూపుతోంది. ప్రజలకు వంట నూనె ధరలు రోజురోజుకు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ. 10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకుపైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం తెలిపారు. ప్రతి పరీక్షకేంద్రం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పరిసరాల్లో ప్రజలు గుమిగూడకుండా 144సెక్షన్ కఠినంగా అమలు చేసినట్లు తెలిపారు.
తిరుపతి నగరంలోని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కార్యాలయం వద్ద శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిందని తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
KDP: 16వ తేదీన నిర్వహించాల్సిన రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమం వాయిదా పడినట్లు చక్రాయపేట తహసిల్దార్ విజయకుమారి శనివారం తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రైతులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
W.G: ఆకివీడు జాతీయ రహదారి పక్కన ఉన్న లైబ్రరీ వద్ద ఆక్రమణలను నగర పంచాయతీ అధికారులు శనివారం తొలగించారు. తోపుడుబండ్లు, చిరు వ్యాపారుల వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. ఈ ప్రదేశంలో తరచుగా వాహనాలు స్తంభిస్తుండటంతో స్థానికుల ఇబ్బందులను గమనించి ప్రక్షాళన చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో గత పాలకులు కూటమి ప్రభుత్వానికి కంగ్రాట్స్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. అబద్ధాలను ప్రజలు నమ్మరని, అందుకే గత పాలకులకు ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆమె పేర్కొన్నారు.
KDP: దువ్వూరు మండలం గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుడి పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది.
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావును ఆయన క్యాంప్ కార్యాలయంలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కొరత, భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇరువురు నిర్ణయించారు.
BPT: వాడరేవు గ్రామానికి చెందిన బాలుడు కనిపించకపోవడంతో తండ్రి నూకరాజు గత సోమవారం ఎస్పీ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా గాలింపు చేపట్టి బాలుడిని కాకినాడలో గుర్తించారు. అనంతరం చీరాల రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: శృంగవరపుకోట మండలం వినాయక పల్లి గ్రామంలో ఘనంగా శ్రీ పరదేశమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఇవాళ ఉదయం గ్రామస్థులు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేళా తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
TPT: చోరీకి గురైన వడ్డానం కొరియర్లో బాధితురాలు ఇంటికి చేరింది. నాయుడుపేట మండలం పండ్లూరు సమీపంలోని ఓ హోటల్లో ఇటీవల వేడుక జరిగింది. రేణిగుంట ప్రాంతానికి చెందిన శిల్ప అనే మహిళ హాజరైంది. ఆమె 16 సవర్ల వడ్డాణం చోరీకి గురైంది. బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వడ్డాణం బాధితురాలు ఇంటికి కొరియర్లో వచ్చింది.
ప్రకాశం: పొన్నలూరు మండలం నాగిరెడ్డి పాలెంలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ నిఘా ఇవాళ నిర్వహించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఎస్సై సత్యనారాయణ డ్రోన్ ద్వారా గగనతలం నుంచి పరిశీలించారు. ఈ డ్రోన్ పర్యవేక్షణ ద్వారా అక్రమ కార్యకలాపాలు, అనుమానస్పద వ్యక్తుల కదలికలను గమనించవచ్చన్నారు. ఈ టెక్నాలజీ వినియోగంతో నిఘా ఉంటుందన్నారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎంఎటి కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం శనివారం 7వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా నేతలు టిడ్కో గృహాలను ఈ ఉగాది నాటికైనా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో CPI పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
TPT: క్రైమ్ డిటెక్షన్లో రాష్ట్ర స్థాయి లో ప్రతిష్టాత్మక అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అవార్డులో తిరుపతి జిల్లా పోలీసులకు గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ABCD అవార్డు, నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట సబ్డివిజన్ డీఎస్పీ బృందంను జిల్లా ఎస్పీ అభినందించారు.
KDP: జమ్మలమడుగు (M) దేవగుడిలో గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెరటి కోళ్లు పంపిణీని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు ఆదినారాయణరెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. ఒక్క యూనిట్ విలువ రూ.3,700 కాగా, ప్రతి యూనిట్లో ఏడు పెట్టలు, మూడు పుంజులు ఇచ్చారు.