NLR: పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో 16వ డివిజన్ ఇంఛార్జిగా జయరామిరెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిజమైన కార్యకర్తగా జయరామిరెడ్డి సేవలు చేశారని కొనియాడారు.
NLR: సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో సాగు నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. దీనిలో భాగంగా అధ్యక్షుడిగా గుత్తా వెంకట కృష్ణయ్య నాయుడు, ఉపాధ్యక్షుడిగా కోసూరు బాలకృష్ణయ్య సభ్యులుగా పెమ్మసాని పార్ధసారధి నాయుడు, వేలూరు సంజీవయ్య నాయుడు, కోసూరు చిన్నబ్బయ్య,పెమ్మసాని ప్రసాద్ నాయుడు ఎన్నికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.
NLR: బుచ్చి మండలంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ నోట్ల సుప్రజ మురళి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలను అర్పించారని కొనియాడారు.
NLR: బుచ్చి మండలంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ మొర్ల సుప్రజ మురళి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలను అర్పించారని కొనియాడారు.
NLR: బుచ్చి మండలంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ మొర్ల సుప్రజ మురళి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలను అర్పించారని కొనియాడారు.
NLR: గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు నాయుడుపేట, దొరవారిసత్రం, ఓజిలి, పెళ్లకూరు, చిట్టమూరు మండలాల నాయకులు బయలుదేరారు. వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నేటి ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని, అలాకాని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ తన చిన్ననాటి స్నేహితులతో ఆప్యాయంగా గడిపారు. వారిని పలకరించి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యేను ఆయన బాల్య స్నేహితులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలు మధురానుభూతులని MLA అన్నారు.
సత్యసాయి: తిరుపతికి విచ్చేసిన కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిజాసింగ్కి రేణిగుంట విమానాశ్రయం వద్ద ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, టెక్స్టైల్స్ శాఖ సవితమ్మ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి సవిత ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
KDP: కడప నగరంలోని స్థానిక బిల్డప్ సర్కిల్ సమీపాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో, ఆదివారం పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు, కుంకుమార్చన చేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
ATP: రాయదుర్గం మండలం రాతిబావి వంక గొల్లల దొడ్డి సమీపంలో విద్యుత్ షాక్కు గురై ఎలుగుబంటి మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రాతిబావివంక గొల్లలదొడ్డి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎలుగుబంటి ఎక్కడంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు.
ATP: బహిరంగంగా మద్యం సేవించడం నిషేధమని, చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ జగదీశ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 85 కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహన చోదకులపై 10కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
CTR: కుప్పం మున్సిపల్ పరిధిలోని మోడల్ కాలనీలో డీఎస్పీ పార్థసారథి పర్యవేక్షణలో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. సుమారు 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అనుమానితులకు ఇళ్లను అద్దెకు ఇవ్వరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు శారదానగర్లో ఆదివారం మున్సిపల్ సిబ్బంది కాలువల పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టారు. మున్సిపల్ శానిటరీ అధికారుల పర్యవేక్షణలో ఈ పూడిక తీత పనులు జరిగాయి. జేసీబీ సాయంతో డ్రైనేజీలో పూడికను, చెత్తను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
NDL: ప్రజల సమస్యలపై ఆర్జీలను స్వీకరించి, తక్షణమే పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బనగానపల్లెలో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సాగునీటి సంఘాలకు ఎన్నికైన నేతలు పంట కాల్వలను అభివృద్ధి చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
NDL: శ్రీశైల జలాశయంలో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో నీటి నిల్వలు నిలకడగా నమోదయ్యాయి. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గానూ 863.80 అడుగులు, గరిష్ఠ నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను 118.0544 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. కాగా, ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ ఫ్లో లేదు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, సాగునీటి పథకాలకు నీటి విడుదలను నిలిపివేశారు.