• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు ఆర్చరీ క్రీడాకారులు ఎంపిక

ప్రకాశం: ఆర్చరీ సబ్ జూనియర్ బాలబాలికల ఎంపిక ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణారావు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఒంగోలులోని ఏబీఎం డిగ్రీ కాలేజీ ఆవరణలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. 2007 జనవరి 1వ తేదీ తరువాత పుట్టిన వారు మాత్రమే అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9652241641 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

December 15, 2024 / 10:04 AM IST

22 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

SKLM: మెలియాపుట్టిలో 22 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ రామారావు, ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. శనివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా మెలియాపుట్టిలోని మహేంద్రతనయ నది బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి లభ్యమైందన్నారు.

December 15, 2024 / 09:53 AM IST

యువతిని చంపిన యువకుడు మృతి

NDL: నందికొట్కూరులో ఈనెల 9న యువతికి నిప్పంటించి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రేమోన్మాది రాఘవేంద్రకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర శరీరం చాలా వరకు కాలిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

December 15, 2024 / 09:48 AM IST

‘నా రాజకీయ అరంగేట్రానికి కారణం NTR’

కృష్ణా: పోరంకిలో శనివారం జరుగుతున్న ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలలో సినీనటి జయప్రద పాల్గొన్నారు. సినీ నటిగా ఉన్న తన రాజకీయ అరంగేట్రానికి కారణం ఎన్టీఆర్ అని, టీడీపీలో సేవకురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించానన్నారు. తెలుగువారంతా ఆరాధించే గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఆయనకు ఇష్టమైన విజయవాడలో జరగడం ఆనందదాయకమన్నారు.

December 15, 2024 / 09:48 AM IST

ప్రమాదకరంగా ఫుడ్ కాంప్లెక్స్ రోడ్డు

NLR: నెల్లూరు గ్రామీణ అయ్యప్ప గుడిమెట్ట సమీపంలో ఫుడ్ కాంప్లెక్స్కు వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయంగా ఉండడంతో వానచోదకులు, పాదచారులు రాకపోకలు సాధించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుకు ఒకవైపు జేసీబీ వాహనాలను దారి పొడవునా పెడుతున్నారు. ఈ రోడ్డు గుంతలపై నగరపాలక సంస్థ అధికారులు మట్టి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

December 15, 2024 / 09:22 AM IST

నీటి సంఘం అధ్యక్షులు 12 మంది ఏకగ్రీవం.!

NLR: పామూరు మండలంలోని 12 నీటి వినియోగదారుల సంఘాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవమైనట్లు పామూరు తహశీల్దార్ రమణారావు, ఇరిగేషన్ ఏఈఈ సీహెచ్, ప్రసాదులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని సంఘాల అధ్యక్షులు టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారని అన్నారు.

December 15, 2024 / 09:15 AM IST

తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి తీవ్రత

VZM: కురుపాం మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయి, చలి తీవ్రంగా పెరిగింది. దీంతో చలి తీవ్రత ఒక్కసారి పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక పేషెంట్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులు చలి తీవ్రత నేపథ్యంలో చిన్నారులు, వృద్దులు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

December 15, 2024 / 08:54 AM IST

గ్రంథాలయంలో అమరజీవీ పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమం

VSP: విశాఖ కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాఠకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. స్థానిక శాఖా గ్రంథాలయ అధికారులు వర్మ, నూకరాజు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు.

December 15, 2024 / 08:51 AM IST

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

ATP: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గుత్తి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి అమరజీవి యైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని వారు పేర్కొన్నారు.

December 15, 2024 / 08:50 AM IST

బెటాలియన్‌లో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు

KDP: సిద్దవటం మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP11వ పోలీసు బెటాలియన్‌లో ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంఛార్జ్ కమాండెంట్ డి.నాగేశ్వరప్ప పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమాండెంట్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.

December 15, 2024 / 08:49 AM IST

విశాఖలో డాగ్ స్క్వాడ్స్ విస్తృతంగా తనిఖీలు

VSP: విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం పోలీసులు డాగ్ స్క్వాడ్స్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, గోపాలపట్నం, సీతమ్మధార, జగదాంబ సెంటర్, మహారాణిపేట తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. అలాగే కొరియర్ కేంద్రాల్లోని పార్సిల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.

December 15, 2024 / 08:46 AM IST

ప్రకాశం బాలుడు మిస్సింగ్.. గుడ్లూరులో ఆచూకీ

NLR: ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన ఓ బాలుడు నెల్లూరు జిల్లాలో దొరికిన ఘటన శనివారం జరిగింది. ప్రకాశం SP మాట్లాడుతూ.. ఒడిశా నుంచి నాలుగేళ్ల క్రితం ప్రదీప్ దంపతులు ఇద్దరు పిల్లలతో ఒంగోలు వచ్చారు. పక్క ఇంట్లో బాయ్ ఫ్రెండ్‌‌తో ఉంటున్న ఓ మహిళ ప్రదీప్ పిల్లలపై కన్నేసింది. ఫ్రెండ్‌‌తో కలిసి శుక్రవారం 10 నెలల బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. పోలీసులు గాలించగా.. నెల్లూరులో దొరికినట్లు...

December 15, 2024 / 08:42 AM IST

ప్రేమ, శాంతి ఏసుప్రభు చూపిన మార్గాలు: చదలవాడ

GNTR: ప్రేమ, శాంతి ఏసుప్రభు చూపిన మార్గాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శనివారం నరసరావుపేటలోని స్థానిక లూధరన్ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సోదర భావం పెరిగి అన్ని కుటుంబాలకు మంచి జరగాలని ఆకాంక్షించారు.

December 15, 2024 / 08:42 AM IST

సోమశిలకు 4,126 క్యూసెక్కుల వరద

NLR: అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి 4,126 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 72.809 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 1,500 క్యూసెక్కులు, కండలేరుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 295 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

December 15, 2024 / 08:41 AM IST

‘జిల్లాలో 281 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం’

AKP: అనకాపల్లి జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ పరిధిలో 16 సంఘాలకు, మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి 28 సంఘాలకు, చిన్న తరహా సంఘాలు 256కు ఎన్నికలు నిర్వహించామన్నారు. వీటిలో 281 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు.

December 15, 2024 / 08:40 AM IST