SKLM: సారవకోట(మం) తర్లిలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకులు, జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు ఎంపీపీ బైరగినాయుడు ఉన్నారు.