KRNL: ఈనెల 25 నుంచి మార్కెట్ యార్డులో ఈ-నామ్ 2.0 ప్రక్రియను అమలు చేస్తున్నట్లు కార్యదర్శి ఆర్.జయలక్ష్మి బుధవారం తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లతో మార్కెట్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.