SS: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను జాప్యం లేకుండా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలను మంజూరు చేశారు. ఎంఎస్ఎంఈ పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు.