ASR: కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే వారపు సంతకు సంబంధించి ఈనెల 8న వేలంపాట నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ అభివృద్ధి అధికారిణి రేష్మ ఇవాళ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.5వేల ధరావత్తు చెల్లించాలన్నారు. వేలంపాట కాలపరిమితి 2027 మార్చి 31వ తేదీవరకు ఉంటున్నారు. బుధవారం ఉదయం 11గంటల నుంచి పంచాయతీ కార్యాలయంలో వేలంపాట నిర్వహిస్తామన్నారు.