ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రికి వివరించి, వాటి పరిష్కారంపై చర్చించారు. యార్డును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రావాలని కోరగా, త్వరలోనే సందర్శిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.