ప్రకాశం: థాయిలాండ్లోని శ్రీరాచాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో మార్కాపురం ఫిజికల్ డైరెక్టర్ డోలా శ్యామలాదేవి అద్భుత ప్రతిభ కనబరిచి ట్రిపుల్ జంప్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించారు. మార్కాపురంలోని ZP బాలుర ఉన్నత పాఠశాలలో ఆమె PDగా పనిచేస్తున్నారు. ఆమె సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనియాడారు.