KKD: గంజాయి తాగిన, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు అన్నారు. శనివారం తుని మండలం టీ. తిమ్మాపురం గ్రామంలో ఓ ఇంట్లో గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశామన్నారు. ఈ దాడుల్లో గంజాయి తాగుతున్న ఓ వ్యక్తిని అదుపులో తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారని వెల్లడించారు.